ఎన్టీఆర్ – గీతా ఆర్ట్స్ పాన్ ఇండియా సినిమాకు డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకులు అందరూ ఆ తరహాలో పాన్ ఇండియా క‌థ‌ల‌తోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వ‌చ్చిన పుష్ప సినిమా సైతం పాన్ ఇండియా రేంజ్లో తెర‌కెక్కింది. పుష్ప బాలీవుడ్లోనే ఏకంగా రు. 100 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు, టాలీవుడ్ వ‌ర్గాల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోల‌తో పాటు తెలుగు మీడియం హీరోలు చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా క‌థ‌ల‌తోనే తెర‌కెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కే సినిమాను సైతం పాన్ ఇండియా రేంజ్లో తీయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆలియాభ‌ట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను ఓన్ చేసుకునేందుకు ఆలియాను తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ న‌టించే మ‌రో సినిమా కూడా పాన్ ఇండియా లెవ‌ల్లోనే తెర‌కెక్కేలా ప్లాన్ చేస్తున్నారు.

త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందుకు వ‌రుస‌గా పాన్ ఇండియా మార్కెట్ నేప‌థ్యంలో ఆ త‌ర‌హా క‌థ‌లే చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ – మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబోలో ఎన్టీఆర్ హీరోగా మ‌రో పాన్ ఇండియా సినిమా వ‌స్తోంది. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌.

ఈ క్ర‌మంలోనే గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో ప‌ర‌శురాం హీరోగా ఓ సినిమా రానుంది. ఎన్టీఆర్ హీరోగా న‌టించే ఈ సినిమా కోసం ప‌ర‌శురాం పాన్ ఇండియా స్టైల్లోనే అదిరిపోయే క‌థ రెడీ చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ పెట్ల మ‌హేష్‌బాబు హీరోగా స‌ర్కారువారి పాట సినిమా తెర‌కెక్కిస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ సినిమా త‌ర్వాతే ఎన్టీఆర్ హీరోగా గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. ఎన్టీఆర్ – బ‌న్నీ ఫ్రెండ్‌షిఫ్ నేప‌థ్యంలో ఎన్టీఆర్ గీతా బ్యాన‌ర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అటు శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాల తర్వాత కూడా ఇదే సంస్థలో మరో సినిమా చేసేలా పరశురామ్‌కు డీల్ ఉంది. అందుకే ఇప్పుడు ఈ కాంబినేష‌న్లో పాన్ ఇండియా సినిమా ప్లాన్ జ‌రుగుతోంది. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది ? అన్న‌ది తెలియాల్సి ఉంది.