RRR పోస్టుపోన్.. ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా RRR . ఈ సినిమాకి టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఈ చిత్రం ద్వారా హీరోలకు ఎంత పాపులరిట్టి వస్తుందో అంతే నెగిటివ్ కూడా వస్తుంది.దానికి కారణం రాజమౌళి సినిమా అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా.

RRR సినిమా ప్రారంభం రోజే నుండే కరోనా ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.అన్ని ఇబ్బందులని అధిగమించి 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. అయితే ఈ వార్త విని ఫ్యాన్స్ కూడా మంచి ఆనందంతో ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మల్లి పెరగడంతో ఫ్యాన్స్ కి మళ్ళి షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్. RRR చిత్రం మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ కి బాగా దెబ్బ పడింది అని చెప్పుకోవాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా కోపంతో రగిలి పోతున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ తరుపున ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ అవకపోవడం తో ఫ్యాన్స్ చాలా అసహనంగా ఉన్నారని చెప్పుకోవాలి.

ఒకపక్క హీరోలందరూ సినిమాలు తీస్తూ OTT లో పోటీ పడుతూ రిలీజ్ చేస్తున్నారు. వాళ్లకు మంచి ఆదరణ కూడా వచ్చింది. ఎన్టీఆర్ మాత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు కాకుండా ఏ సినిమా కూడా రిలీజ్ చేయలేదు .మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదు గత రెండు సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చాడని అనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పండక్కి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశపరచడనే చెప్పుకోవాలి. చూడాలి మరల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎపుడు ఆనంద పరుచుతాడో చూడాలి.