క్రేజీ టాలీవుడ్ మల్టీస్టారర్స్.. టికెట్ ఒక్కటే ఎంజాయ్మెంట్ డబుల్?

ఒకప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుండు అని ప్రేక్షకుల నిరీక్షణగా ఎదురుచూసేవారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్ సినిమాల బాగానే వచ్చాయి. కానీ బాలకృష్ణ చిరంజీవి కాలంలో మాత్రం తక్కువగానే మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగిపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హాట్ టాపిక్ గా మారిపోయిన మల్టీస్టారర్ సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఒక్క టికెట్ పై డబుల్ ఎంజాయ్ మెంట్ పొందేందుకు తెలుగు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. మొన్నటి మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉన్న హీరోలు ఇప్పుడు కథ నచ్చింది అంతే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇక ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి.

మరోవైపు అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున నాగచైతన్య బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇక వీరి కాంబినేషన్ ఎలా ప్రేక్షకులను అలరించబోతోంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. సంక్రాంతి బరిలోకి దిగే ఈ సోగ్గాల్లు అదరగొట్ట పోతున్నారు అని అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మల్టీస్టారర్ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఫిబ్రవరి 4 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. తండ్రి కొడుకుల క్రేజీ కాంబినేషన్ ని థియేటర్లో చూసేందుకు ఆడియన్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై ఒక రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమా తప్పకుండా మెగా అభిమానులందరి మెస్మరైజ్ చేయ బోతుంది అని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ ఇద్దరి కాంబినేషన్ అనేసరికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు పోలీస్ క్యారెక్టర్ లో పవన్.. పవన్ ఆపోజిట్ క్యారెక్టర్ లో రానా నటిస్తుండటంతో సినిమా ఎలా ఉండబోతోంది అనే దానిపై అభిమానులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.