ఆహా కి షాక్ ఇచ్చిన బాలయ్య .కారణం..?

బాలకృష్ణ ఆహా లో హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టాక్ షో వల్ల.. బాలకృష్ణ తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఇక అంతే కాకుండా ఈ షో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తోంది..ఇప్పటివరకు సీజన్ వన్ కి మోహన్ బాబు, రవితేజ, నాని , బ్రహ్మానందం , మహేష్ బాబు వంటి వారు హాజరయ్యి సందడి చేసిన విషయం తెలిసింది అంతే కాదు అప్పుడప్పుడు పండుగల సందర్భంగా అఖండ టీం తో పాటు లైగర్ టీమ్ కూడా వచ్చి సందడి చేసింది. ఇకపోతే ఈ షో కి రాజమౌళి కూడా హాజరయ్యారు.కానీ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ షో కి హాజరు కాకపోవడంతో ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.

కానీ ఆహా టీమ్ స్పందించి కేవలం పది మంది స్టార్ హీరోలతోనే మొదటి సీజన్ అనుకున్నాము ఇక చిరంజీవిని ఎన్టీఆర్ ను సంప్రదించిన అప్పుడు వారు తమ సినిమాలతో బిజీగా ఉండటంతో రెండవ సీజన్ ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రెండవ సీజన్ కు రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య బాబు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీజన్ వన్ పారితోషికం బట్టి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు రెండవ సీజన్ కి పారితోషికం విషయంలో బాగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.సీజన్ టు కి పారితోషికం పెంచేసి ఆహా టీమ్ కి షాక్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ప్రస్తుతం సీజన్ టూ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం..

ఇకపోతే ఇందులో వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కాని ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆహా షో లో రెండవ సీజన్ చేయాలి అంటే తప్పకుండా భారీ స్థాయిలో పారితోషకం ఇవ్వాలని బాలయ్య బాబు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను డిమాండ్ చేసినట్లు సమాచారం.