పెళ్లికి ముందే ఆ హీరోతో ఐశ్వర్యకు అఫైర్ ఉందా?

తమిళ నాట ధనుష్, ఐశ్వర్య విడాకుల ఘటన సంచలనం కలిగిస్తోంది. కోలీవుడ్ తో పాటు యావత్ సినీ పరిశ్రమ కూడా వీరి ప్రకటనతో షాక్ కు గురయ్యారు. తమిళ సూపర్ స్టార్ పెద్ద కుమార్తెగానే కాకుండా దర్శకురాలు, సింగర్ గా కూడా ఐశ్వర్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ సినిమా ప్రమోషన్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా ధనుష్ తనకు పరిచయం అయ్యాడు. తక్కువ సమయంలోనే వీరి మధ్య ప్రేమ ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసింది. 2004లో వీరి పెళ్లి అయ్యింది. ఇద్దరు మగ పిల్లలున్నారు.

ధనుష్, ఐశ్వర్య పెళ్లి నాటికి వయసు చాలా తక్కువే. అయితే ధనుష్ వయసు 21 కాగా, ఐశ్వర్య వయసు 23. భర్త కంటే భార్యే వయసులో పెద్ద. ఐశ్వర్యకు అప్పటికే బడా బడా పారిశ్రామిక వేత్తల కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయి. అయితే తనకు ధనుష్ కావాలని పట్టుబడ్డటంతో పాటు వీరికి కాస్త దగ్గర బంధుత్వం కూడా ఉంది. దీంతో రజనీ కాదలేకపోయాడు. అయితే కొంత కాలం క్రితం తమిళనాట సుచిలీక్స్ ప్రకంపనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ తో పాటు అమలా పాల్ తో ధనుష్ కు అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ఐశ్వర్య, ధనుష్ విడిపోతారు అనే వార్తలు వచ్చాయి. కానీ రజనీ జోక్యంతో కలిసి ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయారు.

ఎక్కువ మంది హీరోయిన్లతో ధనుష్ కు అఫైర్లు ఉండటం మూలంగానే ఐశ్వర్య విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఐశ్వర్యకు కూడా ఓ హీరోతో పెళ్లికి ముందు ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. ఆహీరో శింబు. ధనుష్ తో ప్రేమకు ముందు ఐశ్వర్య శింబుతో ప్రేమలో ఉందట. అయితే ఈ వార్తలను అప్పట్లో అందరూ ఖండించారు. రజనీ కూడా చాలా బాధపడ్డాడట. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ శింబుకు ఐశ్వర్య దూరం అయ్యింది. అటు శింబు సైతం పలువురు హీరోయిన్లతో అఫైర్లు పెట్టుకున్నాడనే వార్తలు వచ్చాయి.