డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పూరి.. మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఎందరో హీరోలకు భారీ మిట్స్ అందించి సత్తా చాటాడు.
ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పూరి జగన్నాథ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ టాలీవుడ్ హీరోల వీక్ పాయింట్లను పూరి బయటపెట్టేశారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాక్యలు చేశారాయన. సినిమా షూటింగ్ అంతా ఇండోర్ సెట్లోనే చేస్తున్నామంటే ప్రభాస్ వెంటనే సినిమా ఓకే చెబుతాడు.. అదే ఆయనకు ఉన్న వీక్నెస్ అంటూ పూరి జగన్నాథ్ తెలియజేశాడు.
అయితే ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న టాక్ మాత్రమే అని పూరి తెలియజేశాడు. ఇక పూరి సినిమాల విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ హిట్తో జోరు మీద ఉన్న ఈయన.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో `లైగర్` చిత్రం చేస్తున్నాడు.
బ్యాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ ఓ కీలక పాత్రలో సందడి చేస్తారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.