ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ తగ్గిపోకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది హీరోయిన్ సాయి పల్లవి. మొదట్లో ఆమె మలయాళంలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రస్తుతం తెలుగులో సైతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఆమె నటించిన ఫిదా సినిమా తోనే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఇమే హీరో ని సైతం డామినేట్ చేసే ఈ విధంగా నటించిందని చెప్పవచ్చు.

ఆమె గ్లామర్ పాత్రల కంటే తనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎక్కువగా చేస్తూ ఉంటుంది సాయి పల్లవి. అయితే ఇది కొద్దిరోజుల వరకు బాగున్నప్పటికీ.. ప్రేక్షకులకు ఎక్కువగా బోర్ కొడుతుందని ఉద్దేశంతోనే సాయి పల్లవి గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమైంది. అలా తాజాగా నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో ఆమె హీరోయిన్ గా గ్లామర్ పాత్రలో నటించింది.

దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులను మరింత ఆకర్షించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె మరింత గ్లామర్ పాత్రలో కనిపిస్తుంది అని అందరూ భావిస్తున్నారు. ఇక సాయి పల్లవి మెల్లమెల్లగా తనకంటూ ఒక ప్రత్యేకతను పెంచుకుని సినిమాలో నటిస్తూ.. తన డిమాండ్ను పెంచుకుంటోంది అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ అ క్రేజ్ తగ్గలేదు అని చెప్పవచ్చు.