అఖండ సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ అయిన క్రేజీ హీరోయిన్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తనకు బాగా కలిసి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ నెల 2వ తేదీన అఖండ‌ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అందుకుంది. అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమాకు వచ్చిన వసూళ్లు బాలయ్య గత సినిమాలకు రాలేదు. గతంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహ – లెజెండ్ రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయితే అఖండకు ఆ రెండు సినిమాలకు మించిన రేంజ్ లో భారీ వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టింది.

మరోవైపు బాలయ్యకు అంతగా పట్టులేని నైజాంలో రు. 20 కోట్ల షేర్ చేసింది. ఇక ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా హాట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటించింది. అలాగే సీనియర్ హీరో జగపతిబాబు… మరో సీనియర్ హీరో శ్రీకాంత్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ముందుగా బాలయ్యకు జోడీగా ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. అయితే ముందుగా బాల‌య్య‌కు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారట.

అయితే అప్పటికే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కాజల్ అఖండ సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. దీంతో అందాల ఆరబోతతో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన‌ ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరు ప‌రిశీల‌న‌కు వచ్చింది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా పరిశీలించారు అట.

చివరకు ఆ అవకాశం ప్ర‌గ్యాకు దక్కింది. ఏదేమైనా కాజల్ – రకుల్ – పాయ‌ల్ ముగ్గురు కూడా బాలయ్య పక్కన నటించే ఛాన్స్ మిస్ అవ్వ‌డంతో పాటు ఒక బ్లాక్‌బ‌స్టర్ హిట్ కూడా మిస్ అయ్యారు. ఇక బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.