`అఖండ‌` ఓటీటీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. అఖండ ఓటీటీ రిలీజ్‌పై ఓ బిగ్ అప్డేట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. అఖండ డిజిటల్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని హాట్‌స్టార్ వారు సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న స్ట్రీమింగ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ తేదీని కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని వార్తలు వ‌స్తున్నారు. మ‌రి ఆ వార్త‌లు నిజ‌మైతే బాల‌య్య ఫ్యాన్స్‌కి పండ‌గే. లేకుంటే మాత్రం ఫ్యాన్స్‌కి నిరాశ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

ఇక‌పోతే ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.