టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సమంత కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి.. నచ్చిన సినిమాలకు ఓకే చెప్పుకుంటూ పోతోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సామ్.. విడాకుల తర్వాత తరచూ ఏదో ఒక ఆసక్తికర పోస్ట్ పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా కూడా తన ఆస్తి, విజయం వంటి వాటిపై ఇన్స్టా స్టోరీస్లో మరో సంచలన పోస్ట్ పెట్టింది.
`సంతోషమే నా అసలైన ఆస్తి.. మానసిక ప్రశాంతతే అసలైన విజయం.. ఆరోగ్యమే ఐశ్వర్యం..దయాగుణమే పరివర్తన` అంటూ తన పోస్ట్లో పేర్కొంది. దాంతో ఎప్పటిలాగే సామ్ పోస్ట్ వైరల్గా మారింది. కాగా, సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే `శాకుంతలం`ను పూర్తి చేసిన సామ్.. ఇటీవలె మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ను ప్రకటించింది. ఇక త్వరలోనే ఈ భామ బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్.