సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ.. కామెడీ పాత్రలో నటించాలని మోజుపడుతోంది. ఈ విషయం ఎవరో కాదు ఆమెనే స్వయంగా తెలిపింది.
బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి పల్లవి.. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఎలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నారని ప్రశ్నించగా.. కామెడీ సినిమా చేయాలనుందని బదులిచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `కామెడీ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. వెండితెరపై కామెడీ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో చూడాలనుంది. ప్రాపర్ కామెడీ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. మరి అలాంటి పాత్ర సాయి పల్లవికి దొరుకుతుందో..లేదో..చూడాలి.