బాలివుడ్ నిర్మాత.. బిజినెస్ మ్యాన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల వీడియోల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసందే. అతడు పలువురు నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అందులో నటి షెర్లిన్ చోప్రా అతడి పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల కేసులో 2021 ఏప్రిల్ లో రాజ్ కుంద్రా పై ఎఫ్ ఐ ఆర్ జారీ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన ఫిర్యాదులో షెర్లిన్ 2019 ప్రారంభంలో రాజ్ కుంద్రా బిజినెస్ మేనేజర్ తనను పిలిచి వీడియోల వ్యాపారం గురించి చెప్పారని తెలిపారు. ఆ తర్వాత షెర్లిన్ చాలా మంది సెలెబ్రెటీ గాళ్స్ తమతో నీలి చిత్రాలు తీసేందుకు రాజ్ కుంద్రా టీమ్ ఒప్పందాలు చేసుకుందామని వెల్లడించడంతో కేసు ఇంకా జఠిలమైంది.
దీంతో అస్లీలత కేసులో రాజ్ కుంద్రా జులైలో అరెస్ట్ అయ్యారు. దాదాపు రెండు నెలల జైలు శిక్ష అనంతరం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. అప్పట్నుంచి ఆయన ఎప్పుడూ బహిరంగంగా కనిపించిందే లేదు. దాదాపు నెలపాటు కుంద్రా భార్య అయిన శిల్పా శెట్టి కోర్టు గొడవలతో పూర్తిగా అజ్ఞాతంలోనే ఉన్నారు. శిల్పా శెట్టి కుంద్రా నుంచి విడిపోతున్నారని అని కూడా వార్తలు ప్రచురితమయ్యాయి. రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదల అయ్యాక ఆయన ఎంతో సంతోషంగా ఉన్న ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు.
అయితే తాజగా కుంద్రా ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను శాశ్వతంగా తొలగించారు. తన భార్య శిల్ప తో కలిసి సరదాగా వేడియోలను పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవాడు కుంద్రా. అయితే ఈ వివాదంతో ఇప్పుడు తన రెండు సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం చర్చనీయంశం అయ్యింది.