ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రమే `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నృత్య నేపథ్యంలో తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 24న విడదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.
క్లాస్ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగిన ఈ చిత్రం తాజాగా అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ఈ నెల 20న గోవాలో ప్రారంభంకానున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది.
ఈ విషయాన్ని శనివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నామని కూడా మేకర్స్ తెలియజేశారు.