అన్నీ పుకార్లే..ప్రియాంక-నిక్ జోనస్ విడాకులపై మధు చోప్రా క్లారిటీ..!

మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్టులో త్వరలో వీరి పేర్లు చేరుతాయని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సాగడానికి కారణం ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ జోనస్ పేరు తొలగించడమే. ఎప్పుడైతే ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరు తొలగించిందో అప్పటినుంచి ప్రియాంక -నిక్ జోనస్ ల జోడీ విడిపోతోంది అంటూ ప్రచారం మొదలైంది.

అయితే ఈ పుకార్లపై ప్రియాంక చోప్రా స్పందించలేదు. కనీసం ఖండించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కుమార్తె విడాకులపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు విడిపోతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని.. ఆమె క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా చెత్త అని.. పుకార్లు ప్రచారం చేయవద్దని ఆమె ఈ సందర్భంగా కోరింది.

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు 2018లో పెళ్లి చేసుకున్నారు. ముందుగా వీరిద్దరూ డేటింగ్ చేసి ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. నిక్ జోనస్ అమెరికాలో పెద్ద సింగర్. నటుడు కూడా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ కంటే హాలీవుడ్ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సినిమాలు తీయడం మొదలు పెట్టిన సమయంలోనే నిక్ జోనస్ ఆమెకు పరిచయం అవడం, ఆ తర్వాత వారి బంధం పెళ్లి వరకు వెళ్లడం జరిగింది.