పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరియు తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి పవన్ ఫ్యాన్స్ను ఖుషీ చేసే గుడ్న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ పై డిజైన్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ తో ఇప్పటికీ అదే హవా కొనసాగిస్తుంది.
ఇక దసరా కానుకగా అక్టోబర్ 15న సెకండ్ సింగిల్ కూడా రాబోతుండగా.. ఈ సాంగ్ ప్రోమోకి సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మరి కొన్ని గంటల్లోనే ఈ ప్రోమో విడుదల కానుందని తమన్ ట్విట్టర్ వేదికగా సూపర్ అప్డేట్ ఇచ్చారు. కాగా, రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, తమన్ సంగీతం అందించారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
https://twitter.com/MusicThaman/status/1447929095136989199?s=20