టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నామని ఎప్పుడో మేకర్స్ ప్రకటించారు. కానీ, అనూష్యంగా సంక్రాంతి బరిలో `ఆర్ఆర్ఆర్` దిగడంతో.. ఇక మహేష్ అప్పుడు రావడం కష్టమే అని ప్రచారం మొదలైంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రచారం నిజమే అని తెలుస్తోంది. సర్కారు వారి పాట వాయిదా పడిందని.. మేకర్స్ ఈ చిత్రాన్ని జనవరి 13న కాకుండా ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు, ఈ కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.