టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. పూర్తిగా కెరీర్పైనే ఫోకస్ పెట్టి నచ్చిన ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవలె రెండు ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేసి సామ్.. త్వరలోనే బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టబోతోంది.
ఇదిలా ఉండే సమంత తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్లకు సోష్ల్ మీడియా వేదికగా స్పెసల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 ఎంట్రీకి ఎంపికైన సంగతి తెలిసిందే. వినోద్ రాజ్ పి.యస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దర్శకుడు విఘ్నేశ్ శివన్, నయనతార నిర్మించారు.
ఈ కారణంగానే “మీ ఇద్దరికీ ఘనమైన అభినందనలు. ఇది చాలా అద్భుతమైన వార్త. ‘కూళంగల్’ సినిమా టీమ్ కి కూడా నా శుభాభినందనలు. మోర్ పవర్ టు యూ“ అంటూ నయన్-విఘ్నేష్లకు విసెష్ తెలిపింది సామ్. ఇక సమంతతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం వారిద్దరికీ అభినందనలు తెలపుతున్నారు.