రాధేశ్యామ్ సినిమాలో క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు అలాగే చాలా మంది ప్రేక్షకులు భారీ గా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం.

యూవి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ,ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 14 సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంటర్వ్యూలో అప్డేట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో 15 నిమిషాలు పాటు ఉత్కంఠభరితంగా సాగే దాదాపు 50 కోట్ల బడ్జెట్ కేటాయించటం మూవీ మేకర్. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు నిర్మాతలు.