టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు.
అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `పుష్ప ది రైజ్` పేరుతో రాబోతున్న ఫస్ట్ పార్ట్ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్టు ఓ పోస్టర్ రూపంలో వెల్లడించారు.
అయితే ఈ సినిమా క్రిస్మస్కు రాదంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఆ వార్తలన్నీ పుకార్లే అంటూ చిత్ర యూనిట్ తాజా పోస్టర్తో తేల్చేయండంతో.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1444142405070962692?s=20