సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారీ జంట. అయితే నయన్-విఘ్నేష్లు ఈ మధ్య తరచూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు.
తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే నయన్కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. నయన్ విఘ్నేష్ కంటే ముందు ఓ చెట్టును పెళ్లాడబోతోందట. అందుకు కారణం.. ఆమెకున్న కుజ దోషమేనట.
కొంతమంది జ్యోతిష్యులు కుజ దోషం ఉండటం వల్ల నయన్ను మొదట ఓ చెట్టుని వివాహం చేసుకోవాలని సూచించారట. విగ్నేష్ శివన్ క్షేమం కోసం నయన్ కూడా జ్యోతిష్యుల సలహాకి ఓకె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. నెట్టింట మాత్రం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.