సమంత వేసిన పరువు నష్టం చానల్ లిస్టు ఇదే..?

హీరోయిన్ సమంత రీసెంట్ గా విడాకులు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈమె కొన్ని చానల్స్ పై కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు కూకట్ పల్లి కోర్టు లో వేసింది. ఇక ఈ రోజున విచారణకు హాజరు కావాల్సిన విషయానికొస్తే.. అందులో ముఖ్యంగా సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, సీఎల్ వెంకట్రావు లపై సమంత పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక వీరి చానళ్లపై ఆమె కోర్టును ఆశ్రయించి తనకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతోంది. అంతేకాకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్ తనకు క్షమాపణ చెప్పాలని, తనపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారాల లింకులను వెంటనే తొలగించాలని ఆమె కోర్టులోదాకలు వేసింది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వెబ్సైట్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో, ఇంటర్నెట్లో తనపై ఉన్న లింక్ నుండి తొలగించాలని కోరుతోంది. ఇలాంటి విషయాలలో మరొకసారి తప్పు జరగకుండా పరువునష్టం వేయాలని ఆమె చెప్పుకొస్తోంది. ఈ రోజున ఈ విచారణ జరుగుతోంది.