సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై డైరెక్టర్ హరీష్ శంకర్.. ట్వీట్ వైరల్..?

హీరో సాయి ధరంతేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇక సాయి ధరంతేజ్ కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు. కానీ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం స్వతహాగా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు.

తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. తనపై తన సినిమా పై ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడానికి త్వరలోనే మీ ముందుకు వస్తానని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా దర్శకుడు హరీష్శంకర్ ఆసుపత్రిలో తేజ్ ని పరామర్శించి నట్లు తెలుస్తోంది. నా సోదరుడు సాయి ధరంతేజ్ లో కలిసాను. అతను అంత సూపర్ హిట్ గా ఉన్నానని, త్వరలోనే అభిమానులను ప్రేక్షకులను కలుస్తాను అని చెప్పడం తనకి సంతోషం వేసిందని హరిశంకర్ తెలియజేశాడు.

ఇక వీరిద్దరూ కలిసి చేతులతో కలిపిన ఫోటో హరీష్శంకర్ షేర్ చేశాడు ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

https://twitter.com/harish2you/status/1450819836104171529?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450819836104171529%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-25015983503473032765.ampproject.net%2F2110082201002%2Fframe.html