అక్కినేని నాగచైతన్య ఇటీవలె భార్య సమంత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన చైతు.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ`, బాలీవుడ్లో `లాల్ సింగ్ చద్దా` చిత్రాలను పూర్తి చేసిన చైతు.. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్నాడు.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్లోనే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉండగానే తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డితో ఓ సినిమా చేసేందుకు చైతు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇటీవలే చైతూకు ఆమె ఓ కథ వినిపించిందని, అది ఆయనకి బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. సీనియర్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ బ్యానర్పై ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై చైతు ఫ్యాన్స్ గుడ్న్యూస్ వింటారు.