మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) యుద్దానికి రంగం సిద్ధమైంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండగా.. మరి కొన్ని గంటల్లోనే హైద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి.
ఇలాంటి తరుణంలో మంచు విష్ణు తండ్రి, సీనియర్ హీరో మోహన్ బాబు తాజా వాయిస్ మెసెజ్ ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ వాయిద్ మెసెజ్లో ఏముందంటే..`తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు.
అయితే కొంతమంది సభ్యులు రోడ్డనపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. ఓటు వేసే ముందు మనసాక్షితో ఆలోచించి వేయండి. నా బిడ్డ విష్ణుని, అతడి పానెల్ను గెలిపించండి. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది.` అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.