అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనారాయణదాస్ నారంగ్ మరియు పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్ను రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధం అవుతోంది. కానీ, ఇక్కడ కాదండోయ్.. మలయాళంలో. అసలు విషయం ఏంటంటే.. కులాంతర నేపథ్యం కలిగిన ప్రేమకథా చిత్రాలు మలయాళంలో బాగా హిట్ అవుతుంటాయి.
ఇప్పటికే అలాంటి చిత్రాలు ఎన్నో అక్కడ విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీ చిత్రాన్ని కూడా `ప్రేమతీరం` పేరుతో మలయాళంలో ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియచేశారు మేకర్స్. E4 మూవీస్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. మలయాళ ప్రేక్షకులను లవ్ స్టోరీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
https://twitter.com/baraju_SuperHit/status/1450325227578163205?s=20