టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అతడితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజల్-గౌతమ్ల వివాహం జరిగింది.
అయితే వీరి పెళ్లై నేటిగా సరిగ్గా ఏడాది. ఈ నేపథ్యంలోనే తమ ఫస్ట్ వెడ్డింగ్ డేను కాజల్ దంపతులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అలాగే తాజాగా గౌతమ్తో చాలా క్లోజ్గా ఉన్న పిక్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కాజల్.. తనదైన శైలిలో భర్తకు మ్యారెజ్ డే విషెస్ను తెలియజేసింది.
అలాగే అభిమానులు, సినీ సెలబ్రెటీలు సైతం కాజల్ దంపతులకు విషెస్ తెలుపుతున్నారు. ఇక మరోవైపు ఫస్ట్ వెడ్డిండ్ డే సందర్భంగా కాజల్-గౌతమ్ల రొమాంటిక్ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సినిమా విషయానికి వస్తే.. కాజల్ ప్రస్తుతం ఆచార్య, ఘోస్ట్ చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో హే సినామిక, కరుంగాపియమ్ చిత్రాలతో పాటు హిందీలో ఉమా అనే సినిమా చేస్తుంది.