వామ్మో..`మ‌హా స‌ముద్రం`ను అంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా..?

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్ర‌మే `మ‌హా స‌ముద్రం`. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు.

Sharwanand and Siddharth's Maha Samudram trailer to release on September 23 - Movies News

భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబర్ 14న విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తాప‌డింది. ఎంత మంది స్టార్లు ఉన్నప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ ఫ్లాప్ మూవీ క‌థ‌ను ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా ప‌ది మంది హీరోలు రిజెక్ట్ చేశార‌ట‌.

Ajay Bhupathi: How the success of RX100 helped Ajay Bhupathi win over his fiancee's family | Telugu Movie News - Times of India

ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తినే స్వ‌యంగా తెలిపారు. ఇక రిజ‌క్ట్ చేసిన ఆ హీరోల‌ లిస్ట్‌లో రవితేజ, రామ్‌, నాని, నితిన్, నాగచైతన్య త‌దిత‌రులు ఉన్నారు. ఏదేమైనా ఆ ప‌ది మంది హీరోలు మ‌హా స‌ముద్రంను రిజెక్ట్ చేయ‌డ‌మే మంచిదైంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.