అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా సూపర్ పాపులర్ అయిన అను.. వెండితెరపై పలు చిత్రాలు చేసి మంచి నటిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా రంగస్థలంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
దాంతో ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు సైతం తలుపు తట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస టీవీ షోలతో పాటుగా పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ.. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలోనూ నటిస్తోంది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో అలరిస్తుంటుంది. అయితే ఈ సారి లంగా ఓణీ ధరంచి ట్రెడీషనల్ లుక్లో మైండ్బ్లాక్ చేసింది. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న అనసూయ తాజా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.