పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మంచి హైట్తో పాటు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీసూ ఉన్న అకీరా ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి వస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చిందని తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అకీరా పవన్ కళ్యాణ్ సినిమాతోనే టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం పవన్ చేస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` ఒకటి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది.
అయితే ఈ చిత్రంలో అకీరా ఓ కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. తండ్రి పవన్తో పాటు అకీరా కలిసి పలు సీన్లలో అలరించనున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా తండ్రి, కొడుకులు ఒకే ఫ్రేములో కనిపిస్తే ఫ్యాన్స్కు పండగే అవుతుంది.