త్వరలో విదేశాలకు వెళ్లనున్న ప్రభాస్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో గా పేరుపొందాడు ప్రభాస్.ఇక ఈయన బాహుబలి సినిమా తో ఓవర్నైట్ కి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అదే తంతు లోని మరొక సినిమా సలార్ కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

డైరెక్టర్ ఓం దర్శకత్వంలో మరొక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని అన్ని భాషలలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడి పాత్ర సైఫ్అలీఖాన్ నటించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు మంచి క్రేజ్ దక్కించుకుంది.

ప్రస్తుతం తాజాగా ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. అదేమిటంటే ఈ సినిమా స్టిల్స్ కోసం ముంబైలో కొంత షూటింగ్ జరగగా.. అందులో ప్రభాస్ మన ఫిట్నెస్ను కోల్పోయాడు అన్నట్లుగా ఫోటోలు కనిపిస్తున్నాయి దీంతో తన ముఖం అంతా లావెక్కడంలా కనిపించడం చేత తన ఫేస్ లో ఉన్న కల,లుక్ ఫిట్నెస్ ఇప్పుడు లేకపోవడం చేత ఆయన తన బాడీ ని సున్నితత్వం గా కనిపించేందుకు త్వరలో యూకే కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.