టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ఈమె.హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జర్నీ చేస్తూనే ఉన్నానని తెలియజేసింది.
ప్రస్తుతానికి ఈమె ముంబై లో ఇల్లు కొని అక్కడే ఉంటుంది. ఇక బాలీవుడ్ లోకి మిషన్ మజ్ను సినిమా తో ఈమె కెరీర్ని మొదలు పెట్టనుంది. ఇక రష్మికకి ఒక సోదరి కూడా వున్నది. ఆమెకు రష్మిక కు దాదాపుగా 16 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉన్నట్లుగా తెలియజేసింది. ఇక రష్మిక తనకు నేను రెండు అమ్మనీ అంటూ తెలుపుకు వచ్చింది.
ఇక ఈమె అమితాబచన్ తో సినిమా చేస్తున్నాను అని తన ఇంట్లో చెప్పగా ఆ మీ ఇంట్లో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారట.గతంలో ఈమెకు ఎన్నో కథలు హిందీలో వినిపించిన అవి నచ్చకపోవడంతో వాటిని వదిలేసింది.అలా చివరిగా”గుడ్ బాయ్”అనే కథను వినడంతో ఆమెకు ఈ సినిమా కథ నచ్చడంతో చేస్తున్నా అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.