సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న రెబల్ స్టార్ ఫ్యామిలీ ఫోటో.. కారణం..?

సోషల్ మీడియాలో స్టార్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కూతుళ్ల దినోత్సవం సందర్భంగా చాలామంది స్టార్లు తమ కూతుర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వారితో దిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు అతని భార్య ఉప్పలపాటి శ్యామలా దేవి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఆమె షేర్ చేసిన ఫోటోలలో కూతుర్లు.. మనవళ్లు మనవరాళ్లు.. తమ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫోటోల్లో యంగ్ స్టార్ కృష్ణంరాజు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ఈ ఫోటో చూస్తున్నంత సేపు కన్నులకు ఎంతో ఇంపుగా కనిపిస్తోంది.ఇకపోతే డాక్టర్స్ డే సందర్భంగా శ్యామలా దేవి షేర్ చేసిన ఫోటోలను చూసి అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

prabhas chill out with his Family

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆది పురుష్ వంటి సినిమాలలో నటిస్తున్నాడు. ఆయన నటిస్తున్న అవన్నీ ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా మూవీస్.