ఈసారి శంకర్ టార్గెట్ వారేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో శంకర్ ఎలాంటి కథను చూపించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శంకర్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వారిని ప్రభావితం చేస్తుంటాడు.

అయితే రామ్ చరణ్‌తో చేయబోతున్న సినిమా కూడా దీనికి మినహాయింపు కాదని తెలుస్తోంది. ఈ సినిమ కాన్సెప్ట్ పోస్టర్‌ను సినిమా లాంఛ్ రోజున రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో దేశంలోని టాప్ ఎమ్ఎన్‌సీ కంపెనీలను టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఏ విధంగా అవినీతి చేస్తున్నారో, ఏ విధంగా ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారో మనకు చూపించబోతున్నారట చిత్ర యూనిట్.

మొత్తానికి దర్శకుడు శంకర్ ఈ సినిమాలో మరోసారి తన మార్క్ కథతో మనల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.