మహేష్ బాబుకు జక్కన్న ఝలక్.. ఇప్పట్లో లేనట్టే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మె్న్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ సినిమా ఉండనుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి గతంలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాల్లో బజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కి్స్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా తరువాత మహేష్ సినిమాకు సమయం చాలా ఉండటంతో ఈ మధ్యలో ఓ బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. దీంతో మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో మహేష్ అభిమానులు మరోసారి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.