సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టే కౌగిలించుకున్నాను అంటున్న ప్రముఖ నటి..!

కండలవీరుడు గా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఏ పాత్రలో నైనా లీనమై పోయే స్వభావం ,అన్నింటికీ మించి సహాయం చేసే గుణం , అన్ని ఇట్టే సల్మాన్ ఖాన్ లో లీనమైపోయాయి. అయితే ఇటీవల ఈయనపై ఒక ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి నటి భాగ్యశ్రీ ..సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టి ఆయన్ని కౌగిలించుకున్నాను అని తెలిపింది.. సల్మాన్ ఖాన్ సినీ జీవితాన్ని నిలబెట్టిన తన రెండవ చిత్రం మైనే ప్యార్ కియా.. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కి జోడిగా భాగ్యశ్రీ నటించి , ఒక సెన్సేషనల్ హిట్ ను క్రియేట్ చేసింది ఈ జోడి..

1989వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకధార కురిపించింది.. ఇటీవల ఒక షోలో పాల్గొన్న భాగ్యశ్రీ అప్పట్లో మైనే ప్యార్ కియా రోజుల్ని గుర్తు చేసుకున్నారు.. షూటింగ్ మొదలు పెట్టిన కొద్ది రోజుల్లో భయపడ్డానని, ఆ తరువాత బాగా కలిసిపోయారు అని ఆమె చెప్పుకొచ్చింది .అంతేకాదు షూటింగ్ బాగా ఎంజాయ్ చేశాం అని కూడా ఆమె చెప్పడం గమనార్హం.. ఇకపోతే ఆమె ఈ సినిమా షూటింగ్ సమయంలో తన వయసు 18 సంవత్సరాలు. అప్పటికే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది.కానీ ఈ సినిమా కోసం జీవిత భాగస్వామిని మనసులో పెట్టుకొని , వేరొకరిని కౌగిలించుకోవడం సబబు కాదనిపించింది. కానీ అక్కడ సీన్ పండాలి అంటే తప్పకుండా ఆమె సల్మాన్ ఖాన్ ను కౌగిలించుకోవాలి.

ఆ సీన్ కోసం సల్మాన్ ఖాన్ ఆమెను బాగా బ్రతిమలాడడంతో కౌగిలించుకుందట. ఇక తర్వాత ముద్దు పెట్టే సీన్ కూడా తనకి ఇబ్బంది అనిపించడంతో, మా ఇద్దరి మధ్య ఒక అద్దాన్ని పెట్టాడు దర్శకుడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. ఇటీవల రాధే శ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది భాగ్య శ్రీ.