మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా.. అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గయాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్ను పోలీసులు మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే సాయి తేజ్ కు చికిత్స జరుగుతుండగా.. తాజాగా వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. తేజ్కు సిటీ స్కాన్ తోపాటు పలు టెస్ట్లు పూర్తి చేసిన డాక్టర్లు.. కాలర్ బోన్ విరిగినట్టు ప్రకటించారు. ఇన్సైడ్ బ్లీడింగ్ కానీ.. ఆర్గాన్ డామేజ్ లేదని తెలిపారు.
ప్రస్తుతం వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 48 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన త్వరగానే కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్తతో మెగా ఫ్యామిలీలో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, హీరో సందీప్ కిషన్, నిహారిక, అల్లు అరవింద్ తదితరులు నిన్న రాత్రే పరుగులు తీశారు.