స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా త్వరలో ఈ సినిమా నుండి మరో అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
పుష్ప చిత్రం నుండి రెండో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ పాటను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి పుష్ప చిత్రం నుండి ఓ రొమాంటిక్ డ్యుయెట్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. బన్నీ, రష్మిక మందనల మధ్య వచ్చే ఈ డ్యుయెట్ అదిరిపోయే రీతిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పుష్ప నుండి తొలి సాంగ్ రిలీజ్ కాగా, అది మాస్ పాటగా అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకుంది. ఇక ఈ పాట అందుకున్న రెస్పాన్స్తో రెండో పాటగా రాబోతున్న డ్యుయెట్ సాంగ్కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జె్ట్తో తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.