గోవాలో మకాం వేస్తున్న లైగర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా పూరీ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తికాగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు శరవేగంగా జరుగుతుండటంతో లైగర్ కూడా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్‌ను గోవాలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ ఏకంగా నెలరోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో పాటు ఒకట్రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాల టాక్.

ఏదేమైనా ఈ షెడ్యూల్‌తో మెజారిటీ షూటింగ్ పార్ట్‌ను ముగించేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నాడు. మరి లైగర్ చిత్రం ఎప్పుడు షూటింగ్ ముగించుకుంటుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, పూరీతో కలిసి ఈ సినిమాను ఛార్మీ ప్రొడ్యూస్ చేస్తోంది.