పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. సలార్, ఆదిపురుస్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్పైన ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రభాస్ వ్యక్తిత్వం చాలా గొప్పది.
ఈయన ఎంతో సున్నితంగా, సింపుల్గా ఉంటాడు. అలాగే తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇక తాజాగా క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ చేసి పరామర్శించాడు ప్రభాస్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శోభిత అనే అమ్మాయి కేన్సర్ బారినపడి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల ఆమె వైద్యులతో మాట్లాడుతూ.. తాను ప్రభాస్ అభిమానినని, అతడితో మాట్లాడాలని ఉందని చెప్పింది.
ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్.. శోభితకు వీడియో కాల్ చేసి ఆమెతో సరదాగా ముచ్చటించారు. అలాగే ఆమె చికిత్సకు సాయం చేస్తానని హామీ ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఇక అభిమాన హీరో నుంచి ఫోన్ రావడంతో ఆశ్చర్యపోయిన శోభిత తన బాధను మర్చిపోయి ప్రభాస్తో హ్యాపీగా మాట్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక మరోవైపు ప్రభాస్ చేసిన పనికి ఆయన ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.