ఓటీటీలో భీమ్లా నాయక్.. స్పీచ్ ఎఫెక్టేనా..?

అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఈ సినిమాని మల్టీస్టారర్ గా దగ్గుపాటి రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్ .. ఇక ఈ సినిమా నుంచి కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ లతోపాటు కొన్ని ట్రైలర్లను కూడా విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత అంచనాలను నెలకొల్పుతున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండగా , డేనియల్ శేఖర్ గా విలన్ పాత్రలో దగ్గుపాటి రానా కనిపించబోతున్నాడు.. ఈ సినిమా కోసం దగ్గుపాటి రానా కేవలం 25 రోజుల కాల్షీట్లను మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది..

ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్ కూడా రికార్డు ధరకే అమ్ముడుపోయినట్లు సమాచారం. మిగిలిన నాన్ థియేట్రికల్ హక్కులు.. అనగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.70 కోట్ల రేంజ్ లో బేరాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలా టికెట్ల రేట్లు ,ఆక్యుపెన్సీ ఇలా అన్నీ కూడా సజావుగా జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా రూ. 80 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ జరుగుతుందని అంచనా.. అన్నీ చూసుకుంటే రూ.170 కోట్ల వరకు టర్నోవర్ జరిగే అవకాశం ఉంటుంది..

కానీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో దర్శకనిర్మాతలు భయపడుతున్నారు.. ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందో లేదో అనే సందేహంతో వీరు ఓటీటీకి సినిమాను ఇవ్వడానికి నిర్మాత సూర్య దేవర నాగ వంశీ సిద్ధమైనట్లు తెలుస్తోంది..ఈయన మాటలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారట. అయితే ఈ సినిమాను నిజంగానే ఓటీటీ లో విడుదల చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.