మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్కు గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రత్యేక వైద్య బృందం ఈయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు.
అయితే తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాదాపు పది రోజులు వెంటిలేటర్పై ఉన్న తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడిందట. ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి ఆయన్ను మార్చారట. స్పృహలోనే ఉన్న తేజ్.. అందరితో మాట్లాడగలుగుతున్నారట.
అంతేకాదు, మరో రెండు లేదా మూడు రోజుల్లో తేజ్ను వైద్యులు డిశ్చార్జ్ కూడా చేసేస్తారని తెలుస్తోంది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక మరోవైపు తేజ్ నటించిన `రిపబ్లిక్` చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మూవీ అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.