సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల రేపే.. లాంచ్ చేసేదెవరంటే..!

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా రిపబ్లిక్. ఈ సినిమాకు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రిపబ్లిక్ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

కాగా కొద్ది రోజుల కిందట హైదరాబాదులోని కేబుల్ బ్రిడ్జి వద్ద సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ సినిమా కూడా విడుదల వాయిదా పడుతుందని అంతా భావించారు. అయితే సినిమా విడుదల ఆగదని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఈ సినిమా విడుదల కన్ ఫర్మ్ అయింది.

రిపబ్లిక్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ జోనర్ లో ఇప్పటికే దేవాకట్ట శర్వానంద్ హీరోగా ప్రస్థానం అనే సినిమా తీశారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. రిపబ్లిక్ మూవీ ని జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.