అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. భారీ అంచనాల నడుము సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాగార్జున్, డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల 24న లవ్ స్టోరీ విడుదల కావడం, సూపర్ హిట్గా నిలవడంతో ఎంతో ఆనందించాను. థియటర్లకు వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్.
అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను.. మా ప్రయాణం ఈ సినిమా విడుదలతో ఆగిపోతోందంటే చాలా బాధను కలిగిస్తోంది. అందుకే ఈ జర్నీని ఆపొద్దు సర్..` అంటూ శేఖర్ కమ్ములను కోరారు. దాంతో ఇప్పుడు చైతు కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.