సాయి ధర్మ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి.. ఎవరంటే?

హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా అల్లుడు సాయిధర్మతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.

అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంపై ఆరా తీశారు. అలాగే గణనాథుడు ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయింది అని తెలియగానే పలువురు సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులు కూడా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ప్రస్తుతం వైద్యులు అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.