యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. వెండితెరపై మంచి నటిగానూ సత్తా చాటుతోంది.
క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ.. ప్రస్తుతం పుష్ప, ఖిలాడీ, రంగమార్తాండ, ఆచార్య తదితరల చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు వరుస ఫొటో షూట్లతో అందాలు ఆరబోస్తూ సోసల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు రచ్చ చేస్తుంటుంది.
తాజాగా కూడా మెరూన్ కలర్ డ్రెస్ ధరించిన అనసూయ..ఎదపై టాటూను చూపిస్తూ హాట్ హాట్గా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఈమె ఫొటోలు చూసిన నెటిజన్లు.. పెళ్లై పిల్లలు ఉన్నా అనసూయ అందాలు ఏ మాత్రం తగ్గడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అనసూయ లేటెస్ట్ పిక్స్పై మీరూ ఓ లుక్కేసేయండి.