మా ఎన్నికల్లో మరొక ట్విస్ట్..!

ఎన్నికల సమరం రోజురోజుకి మరింత పెరుగుతూనే ఉంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలో ట్విస్ట్ తరహాలో మలుపు తిరుగుతోంది.మా ఎన్నిక అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రహస్య విధులకు తెరలేపుతున్నారు.ఇప్పుడు దాంతో మా ఎన్నికలు కాస్త రాజకీయ ఎన్నికల సమరంగా మారుతోంది.

ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తన ఫ్యానెల్ ప్రకటించగా ఇక వారందరితో కలిసి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.వీటి పై బండ్ల గణేష్ ఘాటు విమర్శలు చేశాడు. మంచు విష్ణు కూడా ఇదే తరుణంలో సీక్రెట్ గా విందు ఏర్పాటు చేయగా.. మా ఎన్నికల కాస్త రాజకీయ ఎన్నికల గా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరగనున్నాయి.. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ పడుతున్న జీవిత రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృద్వి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం చాలా దుమారం రేపుతోంది. ప్రస్తుతం మా సెక్రెటరీగా పనిచేస్తున్న జీవిత.. ఆ పదవి అడ్డుపెట్టుకొని మా కార్యాలయంలో ఎన్నికల క్యాంపుకు వాడుకుంటోందని.. తనకు ఓటు వేస్తే తాత్కాలిక సభ్యత్వాన్ని ఇస్తానని చెప్పి ఓటర్లను మభ్య పెడుతోంది అంటూ ప్రచారం చేస్తోంది. ఈ విషయం వృద్ధికి తెలియడంతో.ఎన్నికల అధికారికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారుతోంది.