ఆ విషయంలో కంగనాకు రూల్స్ వర్తించవా?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఈమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది.

అయితే అక్కడ నో మాస్క్,నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా కంగానా మాత్రం పట్టించుకోకుండా, మార్పు లేకుండానే ఎయిర్పోర్టులో కి వచ్చేసింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ విషయంపై ఇంస్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ కంగనా కు దగ్గర్లోనే నో మాస్క్, నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా కూడా నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండా వెళ్ళిపోయింది.

https://www.instagram.com/p/CUWquVjIk-9/?utm_source=ig_web_copy_link

ఎన్నికల తర్వాత ఎలా అయితే రాజకీయ నాయకులు ఓటర్లను పట్టించుకోకుండా వెళ్లిపోతారో, కంగనా కూడా నియమాలను విస్మరించింది అంటూ తప్పుబట్టారు. మరొక యూజర్ మాస్క్ లేకపోతే లోపలికి ప్రవేశం లేదు అన్న నియమాలు సెలబ్రిటీలకు మాత్రం వర్తించవా అంటూ ప్రశ్నించారు.