ఓటీటీ లో సినిమా అందుకే రిలీజ్ చెయ్యలేదు.. గోపీచంద్!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన సినిమా సిటీమార్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో గోపీచంద్ ఈ విధంగా పలు విశేషాలను తెలియజేశారు. గౌతమ్ నంద సినిమా మేము అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది. దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని తెలిపాను. సిటీ మార్ కథ కంటే ముందు విద్యావ్యవస్థ నేపథ్యంలో సంపత్ ఒక కథ చెప్పాడు. అయితే ఇప్పుడప్పుడే సందేశాత్మక చిత్రం వద్దు వేరేది సినిమా చేద్దామని అనడంతో సిటీమార్ కథ రాసుకొచ్చాడు. నాకు కథ నచ్చడంతో చేశాను అని తెలిపారు గోపీచంద్.

ఈ సినిమాలు స్పోర్ట్స్ ఫిలిమ్ కి కమర్షియల్ అంశాలు జత చేశామని, సిస్టర్ సెంటిమెంట్ భావోద్వేగాలతో కూడిన సీన్స్ కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇంతవరకు నేను ఇలాంటి సినిమా చేయలేదని తెలిపారు. ఇక అలాగే సినిమాలు కబడ్డీ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఎలా శిక్షణ ఇచ్చారు అన్న అంశాల గురించి తెలిపారు. 2019 డిసెంబర్ లో సిటీ మార్ సినిమా ప్రారంభమయ్యింది . 2020 వేసవిలో విడుదల చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల 2007 ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాం. కానీ ఇప్పటికి కుదిరింది. అయితే మా సినిమాకు ఓటిటీ ఆఫర్స్ వచ్చాయి. ఇలాంటి సినిమానీ థియేటర్స్ లో చూస్తే బాగుంటుందని ఓటీటీ కి వెళ్ళలేదు అని, ప్రస్తుతం ప్రేక్షకులు కూడా థియేటర్లకు బాగానే వస్తున్నారని తెలిపారు.