టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం పై కేసు నమోదు అయ్యింది. ఈయన తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ గుర్రం చనిపోవడంతో పెటా పిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో గుర్రం యజమాని మణిరత్నం లపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గత నెలలో హైదరాబాదులోని అబ్దుల్లాపూర్మేట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది. యుద్ధం దీనికోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో గుర్రం డీ హైడ్రేషన్ కారణంగా చనిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మణిరత్నం తో పాటు సినిమా నిర్మాణ సంస్థ అలాగే పలువురిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సినిమాను ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టరికల్ ఫిక్షనల్ నవల పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్, విక్రమ్,జయం రవి, త్రిష, వంటి స్టార్ కాస్టింగ్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.