సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా మోసాలు జరుగుతూనే ఉంటాయి.ఎందరికో అవకాశం ఇస్తామని చెప్పి హీరోయిన్లను మోసం చేసిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు.అలా ఎంతోమంది నటీనటులు.. ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అలాంటి వారిలో బుల్లి తెరపై ఒక వెలుగు వెలిగిన యాంకర్ ఉదయభాను కూడా ఒకరు. ఇక ఈమె గురించి కొన్ని విషయాలను చూద్దాం.
నటిగా యాంకర్ గా ఉదయభాను ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇప్పటికీ ఆమెను ఒక దర్శకుడు మోసం చేశాడట.ఈమే మొదటి సారిగా ఎర్రసైన్యం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాలలో కొన్ని పాత్రలలో నటించింది. అంతే కాకుండా కొన్ని సినిమాలలో ఐటెంసాంగ్ లో కూడా నటించింది ఈమె. కానీ కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరమైన 2004లో ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది.
ఇక వీరికి వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే గతంలో ఉదయభాను అప్పట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారట. 2013 లో రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం.. మధుమతి. ఈ సినిమాలో ఉదయభాను,దీక్షాశివకుమార్ నటీనటులు గా నటించారు.ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండగా ఆ సన్నివేశంలో డైరెక్టర్ పై ఉదయభాను చాలా ఆగ్రహం వ్యక్తం చేసిందట.ఆమెకు తెలియకుండానే ఆమె ఎక్స్పోజింగ్ సీను తీసి అందులో పెట్టడంపై ఆమె ఫైర్ అయినట్లు కొన్ని సంచలన వాఖ్యలు చేసింది. ఇక అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.
అందుచేతనే ఏ సినిమాలో నటించిన కూడా ఆమే పాత్రల గురించి వివరించేదట. ఇక అంతే కాకుండా ఒక దర్శకుడితో సంబంధం పెట్టుకున్నట్లు బాపట్ల వార్తలు బాగా వినిపించిన.. ఆ వార్తలు పై ఆ డైరెక్టర్ స్పందించి తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశాడు. కానీ ఈ విషయం ఉదయభాను చాలా మానసికంగా కుంగిపోయేలా చేసింది.